ఏపీ బీజేపీకి నామ్ కే వాస్తే అధ్యక్షురాలిగా ఎన్టీఆర్ తనయ..
హైకమాండ్ వద్ద పురందేశ్వరికి తగ్గిన ప్రాధాన్యం..
పురందేశ్వరి వ్యతిరేకులకు పార్టీలో పెద్ద పీట..
ఏపీ బీజేపీలో జరుగుతున్న కోల్డ్ వార్ ఆసక్తికరమైన మలుపులు తీసుకుంటోంది. కమలం పార్టీకి ఏపీలో చీఫ్ గా ఉన్న పురందేశ్వరిని ఇంటి పోరు పెద్ద ఎత్తున ఇబ్బంది పెడుతోంది. తన ఇంటిని చక్కగా తీర్చిదిద్దుకుంటున్న దగ్గుపాటి పురందేశ్వరికి.. తాను అధ్యక్షురాలిగా ఉన్న పార్టీని లీడ్ చేయడం మాత్రం నానా ఇబ్బందిగా మారింది. ఎన్నికలకు ముందు తాను కోరుకున్న.. సిఫార్సు చేసిన అభ్యర్థులు అందరికీ చోటు కల్పించలేకపోయారు. ఆ తర్వాత పార్టీలోని పురందేశ్వరి వ్యతిరేకులకు నామినేటెడ్ పదవుల్లో పెద్ద పీట వేస్తోంది బీజేపీ హైకమాండ్. ఈ వ్యవహరం అంతా చూస్తున్న వారికి బీజేపీ అధిష్టానం వద్ద పురందేశ్వరి ప్రాబల్యం అంతంత మాత్రమేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
నరసాపురం ఎంపీ టిక్కెట్టును రఘు రామకృష్ణం రాజుకు ఇప్పించాలని పురందేశ్వరి విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ ఆమె పాచిక పారలేదు.. ఆయన స్థానంలో శ్రీనివాస వర్మకు టిక్కెట్ కేటాయించారు. ఆ తర్వాత పురందేశ్వరికి కెబినెట్లో చోటు దక్కుతుందని అంతా భావించినా.. ఆమెను పక్కకు నెట్టి శ్రీనివాస వర్మకు కెబినెట్లో చోటు కల్పించింది పార్టీ హైకమాండ్. అలాగే ఆ తర్వాత వచ్చిన ఎమ్మెల్సీ, రాజ్యసభల్లో కూడా ఆమె వేరే వారిని ప్రతిపాదించినా.. వారి మాటలను బేఖాతరు చేస్తూ.. ఎవ్వరూ ఊహించని విధంగా సోము వీర్రాజును ఎమ్మెల్సీ పదవికి.. పాకా సత్యనారాయణను రాజ్య సభకు ఎంపిక చేశారు కమలం పార్టీ ఢిల్లీ పెద్దలు. ఇది ఓ రకంగా పురందేశ్వరికి షాక్ ఇచ్చినట్టేనని చెప్పాలి.
ఎన్నికల ముందు నుంచి పురందేశ్వరికి నెమ్మదిగా ప్రాధాన్యం తగ్గుతూ వస్తోంది. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో సోము వీర్రాజుకు టిక్కెట్ ఇవ్వడమే కాకుండా.. సోము వీర్రాజు కోసం బీ-ఫారంను ఎయిర్ పోర్టులో పంపడం.. సోము వీర్రాజుకు అనుంగు అనుచరులుగా ముద్ర వేయించుకున్న సోము వీర్రాజు, పాక సత్యనారాయణ వంటి వారికి టిక్కెట్లు కేటాయించడం వంటి నిర్ణయాలు తీసుకోవడం చూస్తుంటే.. కీలక నిర్ణయాల్లో.. తమ మాట నెగ్గించుకునే అంశాల్లో పురందేశ్వరి మాట కంటే.. సోము వీర్రాజుకే అర్హత ఏపీ బీజేపీలో కీలకమైన మార్పులు, చేర్పులు చోటు చేసుకునే అవకాశాలు చాలా స్పష్టంగా కన్పిస్తున్నాయనేది ఏపీ బీజేపీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్.