Home Uncategorized విజయసాయి దెబ్బ.. వైసీపీ అబ్బ..

విజయసాయి దెబ్బ.. వైసీపీ అబ్బ..

0
Vijaya Sai’s blow.. YCP’s fault..

రక్షకుడే శిక్షకు కారకుడు కానున్నారా..?
అంతఃపుర రహస్యాల గుట్టును విజయ సాయి విప్పనున్నారా..?
జగన్ అక్రమాస్తుల కేసులో విజయసాయి రెడ్డి అప్రూవరుగా మారనున్నారా..?
వైఎస్ కుమార్డుగా జగన్ చేసిన అక్రమాల జాబితాను ఆధారాలతో సహా విజయ సాయి అందించనున్నారా..?
ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ.

అమరావతి
ఇంటి గుట్టు లంకకు చేటు అంటారు. ఇప్పుడు వైసీపీ విషయంలో ఇలాగే జరగబోతోందా..? ఇంటి గుట్టు తెలిసిన విజయసాయి రెడ్డి ఇప్పుడు వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డితో విబేధించారు. దానికి కారణాలు కోటరీ మీదకు నెట్టినా.. విజయసాయి ఆగ్రహం మాత్రం నేరుగా తన మాజీ బాస్ జగన్ మోహన్ రెడ్డి మీదే ఉందనే చర్చ ఇప్పటికే ఏపీ పొలిటికల్ సర్కిల్సులో ఉంది. వైసీపీ వరకు.. లేదా వైఎస్ ఫ్యామ్లీ వరకు విజయ సాయిరెడ్డి అంటే ఏదో మామూలు ఆడిటర్ కాదు. అంతఃపురం రహస్యాలన్నీ తెలిసిన విభీషణుడు లాంటి వాడు.

వైఎస్ కుటుంబంలో మూడు తరాలు అంటే వైఎస్ రాజారెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబాలకు చెందిన ఆస్తిపాస్తుల గురించి ఇంచ్ ఇంచ్ తెలిసిన వాడు. అంతా సాఫీగా ఉంటే.. విజయసాయి రెడ్డి వల్ల వైఎస్ కుటుంబానికి.. ముఖ్యంగా జగన్ మోహన్ రెడ్డికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ జగన్ మోహన్ రెడ్డి చరిత్రలో.. ఆర్థిక నేరాలకు సంబంధించిన కేసులు.. సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలు.. ఎఫ్ఐఆర్ లు.. ఛార్జీ షీట్లు.. వంటి వ్యవహరాలు.. జైళ్లు.. బెయిళ్లు వంటి అంశాలు ఎన్నో ఉన్నాయి. ఇందులో ప్రతి అంశమూ జగను కంటే ఎక్కువగా విజయ సాయిరెడ్డికే ఎక్కువగా తెలుసనడంలో ఎలాంటి సందేహం లేదు. పైగా జగన్ మోహన్ రెడ్డి జైలుకెళ్తే.. ఆయన్ను వెన్నంటి ఉన్నారు విజయసాయి.. ఓ విధంగా చెప్పాలంటే అక్రమాస్తుల వ్యవహరంలో జగన్-విజయసాయి రెడ్డిది పాలు-నీళ్ల బంధం.. అలాగే వెలుగు నీడ అనుబంధం.

అలాంటి విజయసాయి రెడ్డి.. ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డిది విబేధించారు. రాజ్యసభకు రాజీనామా చేశారు. పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇప్పటికే మద్యం స్కాంలో జరిగిన చాలా లోగుట్టు వ్యవహరాలను సిట్ బృందానికి.. ప్రభుత్వ పెద్దలకు వివరించేశారని సమాచారం. ఇదంతా ఓ ఎత్తు అయితే.. అసలు జగన్ మోహన్ రెడ్డి మీదున్న సీబీఐ-ఈడీ కేసుల దర్యాప్తు నత్తనడకన సాగుతోంది. చాలా కాలంగా చలనం లేకుండా అలా పడి ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో.. మారిన పరిణామాలతో జగన్ మోహన్ రెడ్డి మీదున్న పాత కేసులన్నీ మళ్లీ క్యూ కట్టి కోర్టు ముందుకు వచ్చే సూచనలు చాలా స్పష్టంగా కన్పిస్తున్నాయి. అయితే ఇప్పుడు అసలు చర్చ ఏంటంటే.. సీబీఐ, ఈడీ కేసుల విషయంలో విజయసాయి రెడ్డి జగనుకు సంబంధించిన గుట్టును విప్పనున్నారా అనేది ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో విపరీతంగా చర్చ జరుగుతోంది. ఆ కేసుల్లో విజయసాయి రెడ్డి అప్రూవరుగా మారుతారా అనే చర్చ కూడా విపరీతంగా జరుగుతోంది. ఎందుకంటే.. జగన్ మీద.. జగన్ చుట్టూ ఉన్న కోటరీ మీద విజయసాయి రెడ్డి చాలా సీరియస్సుగా ఉండడమే కారణమంటున్నారు. జగన్ కోసం.. అంతా తానై చేయడమే కాకుండా.. జైలుకు కూడా వెళ్తే.. తనకు కాకుండా.. వేరే వారికి ప్రయార్టీ ఇవ్వడం ఎంత వరకు కరెక్ట్ అని విజయసాయి రెడ్డి భావిస్తున్నారట. దీంతో వీలైనంత వరకు అంతఃపురం రహస్యాలను బయటపెట్టడానికి ఇప్పటికే టీడీపీ పెద్దలతో ఒప్పందం కుదిరిపోయిందనే చర్చ యమ జోరుగా సాగుతోంది.

ఇదే కనుక జరిగితే.. ఏపీలో రాజకీయాలు భవిష్యత్తులో చాలా మలుపులు తిరగడమే కాదు.. ఏపీ రాజకీయ ముఖచిత్రం మారిపోయే అవకాశాలు చాలా స్పష్టంగా కన్పిస్తున్నాయనేది ఏపీలో జరుగుతున్న చర్చ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2