అన్నవరానికి చెందిన గణేశ్ శర్మకు కంచి పీఠం పిఠాధిపతిగా అవకాశం.
సన్యాస స్వీకరణ, నామకరణ మహోత్సవానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వ అతిథిగా పయ్యావుల కేశవ్.
కంచి కామకోటి పీఠం పిఠాధిపతిగా ఏపీకి చెందిన సత్యచంద్రశేఖరేంద్ర సరస్వతి శంకరాచార్య వ్యవహరించనున్నారు. ఏపీకి చెందిన అన్నవరం పుణ్యక్షేత్రానికి చెందిన గణేశ్ శర్మ 71వ కంచికామకోటి పీఠం ఉత్తర పిఠాధిపతిగా వ్యవహరించనున్నారు. ఏప్రిల్ 30వ తేదీన సత్యచంద్రశేఖరేంద్ర సరస్వతి శంకరాచార్య సన్యాస స్వీకరణ, నామకరణ మహోత్సవం నిర్వహించనున్నారు. కంచికామకోటి పీఠం శ్రీ శ్రీ విజయేంద్ర సరస్వతి మహా స్వామిజీ ఆధ్వర్యంలో ఈ మహోత్సవం జరిగింది. ఈ మహోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అతిథిగా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ హజరయ్యారు. అలాగే టీటీడీ నుంచి ఛైర్మన్ బీఆర్ నాయుడు కూడా ఈ కార్యక్రమానికి హజరయ్యారు.