26.5 C
Hyderabad
సోమవారం, జూలై 7, 2025

బాబుకు.. పవనుకు బిగ్ షాక్ ఇచ్చిన బీజేపీ..

ఎవ్వరూ ఊహించని విధంగా పాకా సత్యనారాయణ పేరును రాజ్యసభకు ఖరారు చేసిన బీజేపీ..
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లకు హైకమాండ్ గా మారిన బీజేపీ.

ఏపీలో కూటమి ఏర్పడింది. ఎన్నికల్లో కూటమిలోని మూడు పార్టీల అభ్యర్థులు అద్భుతమైన విజయం సాధించారు. ఇందులో ఏ పార్టీ పాత్ర ఎంత వరకు ఉందనే విషయం అందరికీ తెలిసిందే.. ఇందులో కొత్తగా చెప్పేదేం లేదు. కానీ ఏపీలోని కూటమిని రాజకీయంగా ఎక్కువగా ప్రభావితం చేస్తోంది మాత్రం కచ్చితంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీనేననే విషయం కచ్చితంగా చెప్పొచ్చు. ఏపీలో ఎమ్మెల్సీ స్థానాలు కానీ.. ఎంపీ స్థానాలు కానీ ఖాళీ అయితే.. అక్కడ ఎవరిని భర్తీ చేయాలోననే అంశాన్ని తేల్చేది.. తేల్చి చెప్పేది మాత్రం బీజేపీనే. ఒకవేళ బీజేపీలోని కూటమిలోని మిగిలిన రెండు పార్టీలకు ఇబ్బంది అయినా సరే.. టీడీపీ లేదా జనసేన అన్ని మూసుకుని కూర్చొవాల్సిందే. అవును.. కచ్చితంగా మూసుకోవాల్సిందే. రాజ్యసభలో బీజేపీ ఖరారు చేసిన అభ్యర్థిత్వాన్ని చూసిన తర్వాత ఇదే తరహా చర్చ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో జరుగుతోంది. ఎవ్వరూ ఊహించని విధంగా బీజేపీ సీనియర్ నేత.. పాకా సత్యనారాయణ పేరును ఖరారు చేసింది బీజేపీ. ఈ పేరును.. ఈ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తుందని ఎవ్వరూ ఊహించ లేదు.

సరే ఎవరు పార్టీ అభ్యర్థిని వారు ఖరారు చేసుకుంటారు.. ఇందులో కూటమిలోని మిగిలిన పార్టీలకు వచ్చే ఇబ్బంది ఏంటనే చర్చ రావడం సహజం. కానీ గత చరిత్రతో పాటు.. రాజ్యసభ సీటు ఖరారు విషయంలో ఇటీవల జరిగిన పరిణామాలు చూస్తుంటే బీజేపీ కూటమిలోని టీడీపీ, జనసేన పార్టీల అధినాయకత్వాలను ఎంతగా ఇబ్బంది పెడుతుందో అర్థం చేసుకోవచ్చు. ఈ సీటు ఎవరి కోసం అనుకున్నారు.. చివరకు అది ఎక్కడకు చేరిందోననేది ఆసక్తికరంగా ఉంది. విజయసాయి రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానాన్ని తిరిగి విజయసాయి రెడ్డికే కేటాయిస్తారనే చర్చ జరిగింది. ఆ తర్వాత విజయసాయి రెడ్డికి కాదు.. వేరే వ్యక్తులకు కేటాయిస్తారని

రకరకాల పేర్లూ వినిపించాయి. వాటిల్లో భాగంగా తమిళనాడు బీజేపీ మాజీ చీఫ్ అన్నామలైకు కేటాయిస్తారని ప్రచారం జరిగింది. అలాగే మరో పేరు మందకృష్ణ మాదిగ రాజ్యసభకు వెళ్తారని చాలా విస్తృతంగా చర్చ జరిగింది. రాజ్యసభ టిక్కెట్ విజయసాయి రెడ్డికి ఇవ్వడం ఇష్టం లేని వారు ఈ రకమైన వాదనను తెర మీదకు తెచ్చారనే చర్చ జరిగినా.. రాజ్యసభ స్థానానికి అయితే విజయసాయి రెడ్డి.. లేదా అన్నామలై అదీ లేదా మంద కృష్ణ మాదిగలో ఎవ్వరో ఒకరికి దక్కుతుందని మాత్రం చాలా మంది బావించారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. బీజేపీ సీనియర్ నేత పాకా సత్యనారాయణకు ఆ స్థానాన్ని ఖరారు చేసింది.

ఇది టీడీపీ-జనసేనలకు చాలా ఇబ్బందికర అంశమేననే చర్చ ఇప్పటికే జరుగుతోంది. పాకా సత్యనారాయణ పేరు ఎవ్వరూ ఊహించని అంశమైతే.. పాకా సత్యనారాయణ గత చరిత్ర కూడా దీనికి ప్రధాన కారణంగా కన్పిస్తోంది. పాకా సత్యనారాయణ కావడానికి పార్టీ సీనియర్ నేతగా కొనసాగుతున్నారు.. అందరూ ఆయన్ను గౌరవిస్తారు. కానీ ఆయనకు ఇంకో ముద్ర కూడా ఉంది. అదేటంటే.. పాకా సత్యనారాయణ చంద్రబాబు వ్యతిరేకి.. సోము వీర్రాజుకు సన్నిహితుడు అనే ముద్ర చాలా బలంగా ఉంది. ఇప్పుడు పాకా అభ్యర్థిత్వం ఖరారు చేయడంతో ఇదే తరహా చర్చ జరుగుతోంది. కూటమి ఏర్పడిన నాటి నుంచి బీజేపీ తాను అనుకున్న మాట నెరవేర్చుకుంటుందే తప్ప.. మిత్రపక్షాల మాటలను ఏ మాత్రం లక్ష్యపెట్టడం లేదనే చర్చ జరుగుతోంది. బీజేపీ కారణంగానే జనసేన కొన్ని అసెంబ్లీ సీట్లను.. లోక్ సభ స్థానాలను తగ్గించుకుంది. ఇక టీడీపీ కూడా చాలా వరకు రాజీ పడింది. ఎన్నికల్లో రఘు రామకృష్ణం రాజుకు నరసాపురం టిక్కెట్ ఇచ్చేందుకు బీజేపీ ససేమిరా అంది. దీంతో తప్పని సరి పరిస్థితుల్లో రఘు రామకృష్ణం రాజును పార్టీలోకి చేర్చుకుని.. టిక్కెట్ ఇవ్వక తప్పని సరి పరిస్థితిలోకి వచ్చింది టీడీపీ. ఇంత చేస్తున్నా.. బీజేపీ మాత్రం తాను అనుకున్న వ్యవహరాలను తానిష్టం వచ్చినట్టు చేసుకుని వెళ్లిపోతోందనే చర్చ పొలిటికల్ సర్కిల్సులో విపరీతంగా వినిపిస్తోంది.

చంద్రబాబు వ్యతిరేకులను ఏరి కొరి పదవులు ఇస్తున్నారని బీజేపీ గురించి ఏపీ పొలిటికల్ సర్కిల్సులో హాట్ డిస్కషనుగా ఉంది. రఘు రామకృష్ణం రాజును కాదని.. నరసాపురం టిక్కెట్టును శ్రీనివాస వర్మకు కేటాయించారు. అక్కడితో ఆగకుండా సదురు వర్మకు కేంద్ర మంత్రి పదవి కేటాయించారు. అలాగే చంద్రబాబుతో చెడుగుడు ఆడుకున్న సోము వీర్రాజుకు ఎమ్మెల్సీ టిక్కెట్ కేటాయించారు. ఇప్పుడు సోము సన్నిహితుడు.. చంద్రబాబు వ్యతిరేకిగా ముద్ర వేయించుకున్న పాకా సత్యనారాయణకు టిక్కెట్ కేటాయించారు. ఇది సహజంగానే టీడీపీని ఇబ్బందుల్లోకి నెట్టే వ్యవహరం.. చికాకు పరిచే వ్యవహరంగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదనేది పొలిటికల్ సర్కిల్సులో హాట్ డిస్కషనుగా ఉంది. తమకిష్టం లేని వ్యక్తులకు పదవులు కట్టబెడుతున్నా.. వారిని వద్దు అని గట్టిగా చెప్పలేని పరిస్థితుల్లో టీడీపీ-జనసేన పార్టీలు ఉన్నాయి. బీజేపీని కాదంటే.. ఏం తేడా వస్తుందో.. ఎందుకొచ్చిన గొడవ అని ఇటు చంద్రబాబు.. అటు పవన్ కళ్యాణ్ ఇద్దరూ బీజేపీ విషయంలో రాజీ పడక తప్డం లేదనే చర్చ జరుగుతోంది. ఓ విధంగా చెప్పాలంటే.. ఇప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లకు బీజేపీనే హైకమాండ్ అనేది ఇప్పుడు పొలిటికల్ సర్కిల్సులో వినిపిస్తోంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles